తెలంగాణ:నేడు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం( రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ) సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రత్యేక డిస్కంల ఆర్థిక నష్టాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు,వ్యవసాయ పంప్సెట్లకు ప్రోత్సాహకాలు, విద్యుత్ వినియోగ నియంత్రణ చర్యలపై కూడా చర్చ జరగనుంది.
అదేవిధంగా కొండారెడ్డిపల్లి ( కొండారెడ్డిపల్లి )తరహాలో రాష్ట్రంలో మరిన్ని సోలార్ విలేజెస్ ఏర్పాటు చేయడం, సోలార్ స్టౌ స్కీం అమలు వంటి ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే చర్యలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల మార్పిడి విధానంపై రైతులకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపకల్పన అంశం కూడా చర్చకు రానుంది.అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు,రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కూడా కేబినెట్ చర్చించి అధికారిక కార్యక్రమాల రూపురేఖలు ఖరారు చేయనున్నారు.

