- 1,931 పోస్టులకు తొలి ప్రొవిజనల్ జాబితా
- అభ్యంతరాల పరిశీలన తర్వాత తాజా జాబితా
- జూలై 13 నుంచి 15 వరకు అవకాశం
- MHSRB వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు
MHSRB: తెలంగాణలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) లేదా ఏఎన్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) కీలక అడుగు వేసింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించి రూపొందించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను శుక్రవారం బోర్డు అధికారికంగా విడుదల చేసింది. అంతకుముందు మే 14న అభ్యర్థులు సాధించిన మార్కులు, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రాథమిక జాబితాను విడుదల చేసి, మే 18 నుండి మే 22 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఆయా అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం బోర్డు ఈ తాజా ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రకటించింది.
ఈ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు గానూ, అభ్యర్థుల నుండి మరోసారి అభ్యంతరాలను స్వీకరించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పుడు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై సాయంత్రం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. వారు జూలై 13 నుండి జూలై 15వ తేదీ 5 గంటల వరకు MHSRB వెబ్సైట్లో తమ లాగిన్ వివరాల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ అభ్యంతరాలను ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

