TeluguOne రవిశంకర్: డిజిటల్ మీడియా రంగంలో పాతికేళ్లకు పైగా తనదైన ముద్ర వేసిన ‘తెలుగువన్’ సంస్థ ఇప్పుడు వెండితెరపై మరో సంచలనానికి తెరలేపింది. సామాజికాంశాల నేపథ్యంలో వచ్చిన ‘రాజధాని ఫైల్స్’తో టాలీవుడ్ ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు తమ రెండో ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది. తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. నిన్న (మే 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అధికారికంగా ప్రకటించారు. తొలి చిత్రంతోనే ఆలోచింపజేసే కథను అందించిన రవిశంకర్, ఈసారి అంతకంటే భిన్నమైన, భారీ సబ్జెక్ట్ను ఎంపిక చేశారు. ప్రకృతిలోని ‘పంచభూతాలను’ ప్రధాన కథాంశంగా తీసుకుని, కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించి ఒక విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
ఈ భారీ ప్రాజెక్టుకు టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి కథ-మాటలు అందిస్తుండటం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని హంగులతో, పక్కా ప్లానింగ్తో రూపొందించిన 2027 సమ్మర్ కానుకగా ఈ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

