త్రివిక్రమ్ శ్రీనివాస్ డ్రీమ్ ప్రాజెక్ట్: మాటల మాంత్రికుడిగా గుర్తింపు సంపాదించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన సినిమాల్లో మాటలతో గారడీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కొంతవరకు డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మైథాలాజికల్ సినిమా కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రీసెంట్ గానే ఇచ్చారు. మొత్తానికైతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక సినిమా అయితే పెట్టుకున్నాడట… మహాభారతంలోని కురుక్షేత్రాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాడట. అది తన డ్రీం ప్రాజెక్టు అని కూడా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. మహాభారతం మొత్తం కాకుండా ఓన్లీ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే తను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు అవసరం అని తను కోరుకుంటున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రాజమౌళి సైతం మహాభారతం సినిమాని చేయడం తన డ్రీమ్ అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.
ఇక మధ్యలో త్రివిక్రమ్ కూడా మహాభారతాన్ని బేస్ చేసుకొని ఒక సినిమాను చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరు ఆ సినిమా చేస్తారు. ఒకవేళ ఇద్దరు చేస్తే ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇద్దరు దర్శకులు కూడా ఒకే సినిమా వాళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎవరు ముందుగా సినిమాని తెరకెక్కిస్తారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరు కాంప్రమైజ్ అవుతారా? అసలేం జరగబోతుంది…

