- జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.
- ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందంపై కీలక చర్చలు.
- రాడార్లు, మొబైల్ లాంచర్లు, శిక్షణ ప్యాకేజీపై చర్చించే అవకాశం.
- ఇండో-పసిఫిక్లో భారత్ రక్షణ దౌత్యానికి కీలక ముందడుగు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ”బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్” ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై భారత్-ఇండోనేషియా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం మైలురాయిగా ఉంది.
మార్చిలో ఖరారు చేసిన ప్రాథమిక సింగిల్-సిస్టమ్ ఒప్పందానికి మించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి చర్చల్లో తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్లు, శిక్షణ, నిర్వహణ, సమగ్ర సహాయ ప్యాకేజీ వంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇండోనేషియాకు క్షిపణి మాత్రమే కాకుండా దాని పూర్తి భద్రత, నిర్వహణ వ్యవస్థలను కూడా అప్పగించారు.
ఇండో-పసిఫిక్కు కీలకం..
భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత దౌత్యానికి కీలకం కానున్నాయి. భారత్ ఇప్పటికే ఈ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది. వియత్నాం, ఇండోనేషియాలు ఈ క్షిపణి కోసం చర్చలు జరుపుకుంటున్నాయి. యూఏఈ కూడా దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. 2022 ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్లలో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024లో వీటిని అందించండి.

