- మమత మేనల్లుడి చుట్టు బిగుస్తున్న ఉచ్చు..
- అభిషేక్ బెనర్జీపై రెండో కేసు నమోదు..
అభిషేక్ బెనర్జీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీసీఐ) ఓటమి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీకి ఆ పార్టీ నేతలు వరసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా, మరికొందరు మమత తీరును, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ అభిషేక్పై మరో కేసు నమోదైంది. ఆయన చేసిన ఒక పోస్టు సమాజంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా లేదని, ”అత్యంత బాధ్యతారహితమైనది” అభివర్ణిస్తూ అర్నబ్ కాంతి దాస్ భవానీపూర్ పోలీస్ స్టేషన్లో చేశారు. మే 2న ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ కాపీని కూడా ఫిర్యాదుతో సహా అందించారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో తమను ఓడించేందుకు ఎన్నికల సంఘం పూర్తి శక్తిని ఉపయోగిస్తోందని టీటీసీ నేత కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ”మీ బంగ్లా బిరోధి గుజరాతీ ముఠాకు, వారి తొత్తు జ్ఞానేష్ కుమార్కు నా డైమండ్ హార్బర్ మోడల్కు కనీసం ఒక గీత కూడా పెట్టడానికి పది జన్మలు కూడా సరిపోవు. మీ దగ్గర ఉన్నదంతా తీసుకురండి. నేను యావత్ భారత యూనియన్కు సవాలు విసురుతున్నాను – ఫల్తాకు రండి. మీలో అత్యంత బలవంతులను పంపండి, ఢిల్లీ నుండి గాడ్ఫాదర్లలో ఒకరిని పంపండి. మీకు దమ్ముంటే, ఫల్తాలో పోటీపడండి’’ అంటూ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ సోషల్ మీడియా పోస్టులో ”గుజరాతీ ముఠా” అని అనడం సమాజాన్ని విడగొట్టడమే అని, ముఠా అనే పదం నేరం, అండర్ వరల్డ్తో ముడిపడి ఉన్న పదం అనిదారు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక సమాజాన్ని ముఠాగా ముద్రవేయడం చట్ట స్పూర్తికి , దేశ సామాజిక నిర్మాణ స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు.
ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడాడని ఇప్పటికే బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదైంది. మే 4 ఫలితాలు వెలువడిన రోజు అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు వస్తారో చూస్తానంటూ బీజేపీ కార్యకర్తలను, సపోర్టర్లను బెదిరించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రాజీబ్ సర్కార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. తాజాగా నమోదైన కేసు రెండోది.

