మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నివాసి అయిన సోనమ్.. వ్యాపారవేత్త అయిన రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్నది. 2025, మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడే కొంత మంది కిరాయి హంతకులతో కలిసి భర్త రఘువంశీని చంపినట్లు కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు పంపించారు. అప్పటి నుంచి జైలులో ఉన్న సోనమ్.. ఇటీవలే మేఘాలయ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ తో.. బయటకు వచ్చారు.

