వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితుల ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తుంది. చాలా మంది మొదట్లో పాఠశాలలో మీకు ఎదురయ్యే విషయాలు, తమ మనసులోని పిల్లలు మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా.. కొత్తగా స్కూల్ కి వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే..
ప్రతిరోజూ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలు..
నచ్చిన విషయం..
ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి. ఈ ప్రశ్న పిల్లలలో సానుకూల ఫలితాలు వెలికితీయడానికి. పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు, ఏ తర్వాత అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది.
ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి..
పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, కొత్త స్నేహితుల గురించి మాట్లాడారు. పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా, ఎవరితో అయినా కలవడంలో ఇబ్బంది ఫీలవుతున్నారా? అనే విషయాలు తెలియజేశాయి.
ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి..
కొందరు పిల్లలు స్కూల్లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడతారు. ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి..
పిల్లలను ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అందరూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి, వారిలో బావ వ్యక్తీకరణ నిరంతరం మెరుగుపడతాయి.
*రూపశ్రీ.

