నంద్యాల మిస్సింగ్ గర్ల్: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరికింది. ఇలాంటి నేపథ్యంలో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు వందల మంది పోలీసులు. మొత్తం జల్లెడ పట్టేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి బయటకు వెళ్లినట్లు పోలీసులు ఆ దిశగా.. వెతుకులాట ప్రారంభించిన తర్వాత అసలు విషయం తెలిసింది.
* డయల్ 100కు ఫిర్యాదు..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి కుమార్తె కనిపించిన తర్వాత గుర్తించింది. అన్ని చోట్ల వెతికింది. జాడ తెలియక పోవడంతో ఆదివారం రాత్రి 9 గంటలకు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. తుని ఘటన నంద్యాల ఎస్పీ సునీల్ సోరాన్ అప్రమత్తం అయ్యారు. పాప ఆచూకీ కోసం రాత్రంతా 200 మంది పోలీసులు గాలించారు. డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాల సాయంతో గాలింపు చర్యలు. ఈ చిన్నారి వీధిలో తిరుగుతున్న సిసి ఫుటేజీ కనిపించింది. అయినా సరే జాడ తెలియలేదు.
* జొన్న చేనులో నిద్రపోతూ..
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసులు జల్లెడ పట్టారు. అయితే ఇంటి సమీపంలోని ఓ జొన్న చేనులో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. జొన్న చేనులో చిన్నారి నిద్రపోతూ కనిపించడంతో.. పోలీస్ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాపను తల్లి చెంతకు చేర్చాయి. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పాపను పోలీసులు గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుని చిన్నారి జ్ఞానేశ్వరి కి సంబంధించి నెలలు గడుస్తున్న ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నంద్యాల ఘటన జరగడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా షాక్ కు గురైంది. చిన్నారి ఆచూకీ వెనువెంటనే దొరకడంతో ఉపశమనం పొందింది.

