యథావిధిగా పునరుద్ధరణ కుదరదని స్పష్టం చేసిన భారత్
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన చేసింది. పహల్గాం దాడి అనంతరం.á భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్తో పాక్కు గట్టి బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఆరు దశాబ్దాలకుపైగా ఉన్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి వైదొలగాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏ అంతర్జాతీయంగానైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒప్పుకున్నట్లు తేలితే…ఒక సార్వభౌమ దేశంగా దానిని రద్దు చేసే హక్కు భారత్కు ఉంది. సింధూ జలాల విషయంలో భారత నిర్ణయం పాకిస్థాన్ (Pakistan) చర్యలపై ఆధారపడి ఉంటుంది. సింధూ ఒప్పందాల రూపంలోనే మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే…మార్పులు తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. అదీ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడితేనే సాధ్యమవుతుందని చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం. ఆ ఒప్పందాన్ని నిలిపివేసినప్పటి నుంచి ఉక్కిర్కిక్కిరి అవుతోన్న పాక్…సింధూ జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రేలాపనలు జరుగుతున్నాయి. ఒప్పందం నిలిపివేత వల్ల ఆ దేశంలో నీటికొరత ఏర్పడుతోందని చేస్తోన్న ప్రకటనలను భారత్ ఖండిస్తోంది.
పాక్ తప్పుడు ప్రచారం…
నీటిని చేసే సామర్థ్యాలు లేకనే భారతదేశాన్ని నిందిస్తూ…పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ నిల్వలు ఉన్నాయి. భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ…ఉగ్రవాదాన్ని అరికట్టడానికి దాయాది దేశం అర్థవంతమైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఏవీ లేవన్నాయి. అదీగాక ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న వ్యక్తులు పాక్లో బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని ఎండగట్టాయి.

