CM Vijay Bus Journey: నాయకుడు అంటే ఎలా ఉండాలో నాడు ముఖ్యమంత్రి విజయ్ ని చూసి నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతీ నాయకుడు ఓట్ల ఇంటింటికి వెళ్లారు, ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తారు, కానీ ఎన్నికలు పూర్తి అయ్యి పదవి కోసం చేసిన తర్వాత జనాలను అంటరాని వాళ్ళుగా చూస్తారు ఈ మన నాయకులు. వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు పరదాలు పరుచుకుంటారు, హెలికాప్టర్ లో ప్రయాణిస్తే క్రింద చెట్లను కొట్టేస్తుంటారు, చివరికి తిరుమల కి వెళ్లడం ఇష్టం లేక, ఇంట్లోనే తిరుమల సెట్స్ వేయిస్తారు, ఇలాంటి అద్భుత ఘట్టాలను గతంలో మనం చాలానే చూశాము. కానీ సీఎం విజయ్ ఎన్నికల ముందు ఓట్ల కోసం మన నాయకులూ లాగా డ్రామాలు చేయలేదు , కానీ ముఖ్యమంత్రి అయ్యాక , ప్రజల వద్దే పాలన అన్నట్టుగా ఆయన రూలింగ్ సాగుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు.
రీసెంట్ ఆయన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానిస్తున్న సమయంలో ఒక గర్భిణీ స్త్రీ స్టేజి మీదకు ఎక్కే పరిస్థితిని పరిశీలించిన విజయ్, స్వయంగా తానే క్రిందకు దిగి , ఆ గర్భిణీ స్త్రీని సన్మానించిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూశాం. నేడు సీఎం విజయ్ సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో నడపడం , అక్కడి ప్రయాణికులతో మమేకమై మాట్లాడడం ప్రారంభించారు. ఆయన తీరులో ఇసుమంత గర్వం కూడా కనిపించలేదు. ఈ కాలం లో ఇలాంటి ముఖ్యమంత్రులను ఎక్కడ చూశాము చెప్పండి?, ఆయన పాలన ఏదైనా నేను చేసేదే చెప్తా , చెప్పిందే చేస్తా, ప్రజలే నా దేవుళ్ళు అన్నట్టుగా సాగుతోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవాలయాల్లో VIp దర్శనాలు రద్దు చేయడం , అదే విధంగా దేవాలయాల హుండీలో ఉండే నిధులకు ప్రభుత్వం నిషేధం ప్రకటించడం చాలా ఆదర్శప్రాయమైనవి.
కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదు , ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను అమలు చేయాలనీ ఆదేశించడం, దేవాలయాలు , స్కూల్స్ పరిసరాల్లో మద్యం దుకాణాలు ఎత్తివేయడం, ఇలా ఒక్కటా రెండా , ఎన్నో ఉన్నాయి . అందుకే సీఎం విజయ్ రోజురోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫాలోవింగ్ , క్రేజ్ పెరిగిపోతూ ఉంది. అందరూ విజయ్ లాగా పరిపాలిస్తే ఎంత బాగుంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

