EPFO కొత్త నియమాలు : ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం దాచుకునే డబ్బు సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) అంటారు. ఇప్పుడు ఈఫీఎఫ్ వో సభ్యులకు సులభమైన, సురక్షితమైన సేవలను అందించిన కేంద్ర ప్రభుత్వం కొత్త యూనిడ్ EPFO పోర్టల్లో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా UAN యాక్టివేషన్, ఆధార్ ధ్రువీకరణ, డెత్ క్లెయిమ్ వంటి సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలు ప్రతీ ఈపీఎఫ్ వో ఉద్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
UAN యాక్టివేషన్ ఇక..
వరకు EPFO సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మర్చిపోయినా.. లేదా యాక్టివేట్ చేయవలసి వస్తే నేరుగా EPFO పోర్టల్లోనే ఆ అవకాశం ఉండేది. ఇందులో తమ వివరాలు అందించి మాడిఫికేషన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు కొత్త మార్పులతో ఆ ఫీచర్ను పోర్టల్ నుంచి తొలగించారు. ఇకపై UAN యాక్టివేషన్ లేదా సంబంధిత సేవలను UMANG యాప్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. దీనితో అన్ని ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆధార్ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి..
యూనిఫైడ్ పోర్టల్లో సభ్యుల భద్రతకు కొత్త అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ను తప్పనిసరి చేశారు. సభ్యుల వివరాలు, క్లెయిమ్లు, ఖాతా సంబంధిత సేవలు పొందేందుకు ఆధార్తో ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో నకిలీ క్లేయిమ్లు, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు గుర్తించారు.
డెత్ క్లెయిమ్ ఫెసిలిటీకి ప్రత్యేక సౌకర్యం..
EPFO సభ్యుడు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు లేదా నామినిలు నిధులను పొందేందుకు ఇప్పుడు కొత్త పోర్టల్లో ప్రత్యేకంగా డెత్ క్లెయిమ్ ఫెసిలిటీని కలిగి ఉన్నారు. ఈ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసి పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి క్లెయిమ్ను సులభంగా సమర్పించవచ్చు.
డిజిటల్ సేవలకు ప్రాధాన్యత
పోర్టల్లో సభ్యులకు అవసరమైన అనేక సేవలను పూర్తిగా కొత్త డిజిటల్ రూపంలో అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఖాతా వివరాల పరిశీలన, KYC అప్డేట్, నామినేషన్, క్లెయిమ్ దరఖాస్తులు, ట్రాకింగ్ వంటి సేవలను మరింత వేగంగా పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించారు. ఈ సేవల కోసం కార్యాలయాలను ఆశ్రయించే అవసరం తగ్గనుంది.
సభ్యులకు కలిగే ప్రయోజనాలు
కొత్త మార్పులతో EPFO సేవలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారనున్నాయి. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వల్ల ఖాతా భద్రత పెరుగుతుంది. UMANG యాప్ ద్వారా UAN సేవలు సులభంగా పొందవచ్చు. అలాగే డెత్ క్లెయిమ్ వంటి కీలక సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.
ఏం చేయాలి?
EPFO సభ్యులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు, KYC ని తాజాగా ఉంచుకోవాలి. అలాగే UMANG యాప్ను డౌన్లోడ్ చేసుకుని UAN సంబంధిత సేవలను వినియోగించుకోవడం మంచిది. కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్లోని మార్పులను తెలుసుకుని వాటిని సులభంగా పొందేందుకు భవిష్యత్తులో సేవలు మరింత పొందే అవకాశం ఉంటుంది.

