ఢిల్లీ: NEET పేపర్ లీక్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ, నీట్ పరీక్షలతో సహా కీలక పరీక్షలు NTA ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. NTAలో కీలకంగా ఉన్న 47 మంది అధికారులను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సోర్సెస్- “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 47 మంది అధికారులను వారి సర్వీస్ నుండి తొలగించింది. ఈ అధికారులలో కొందరిపై చట్టపరమైన మరియు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయి. పేపర్ లీకేజీలపై వివాదంలో ఉన్న NTA యొక్క పూర్తి పునర్నిర్మాణంలో ఇది భాగం.” pic.twitter.com/zz2mcGIqQp
– ANI (@ANI) జూలై 24, 2026
ఈ 47 మంది వ్యక్తులపై.. తొలగింపులతో పాటు, క్రిమినల్, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. NTA పనితీరును సంస్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
NTA నుండి 47 మందిని తొలగించారు మరియు వారిలో కొందరిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యొక్క ఒక పెద్ద మార్పును సిద్ధం చేస్తోంది, వచ్చే ఒక నెలలోగా మొత్తం ఫ్రేమ్వర్క్ను పునర్నిర్మించాలని యోచిస్తోంది. ఏజెన్సీ అవుట్సోర్సింగ్… pic.twitter.com/fAYl0zGZ7N
— IANS (@ians_india) జూలై 24, 2026
రాబోయే రోజుల్లో మరిన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని. NTAలో మంజూరైన 39 పర్మినెంట్ పోస్టులకు గాను 24 మంది శాశ్వత ఉద్యోగులతో ఏజెన్సీ పనిచేస్తోందని జులై 22న విద్యా మంత్రిత్వ శాఖ లోక్సభకు వివరించింది. NTA కార్యకలాపాల కోసం 73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 124 మంది అవుట్సోర్స్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.

