తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. శనివారం ఐదో విడత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేశారు. ఐదో విడతలో 1.69 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.78 కోట్లు జమ అయ్యాయి. కాగా శుక్రవారం నాల్గో దఫా రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ చేశారు.
మూడో విడతలో భాగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేశారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వివరించారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 61, 35 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రూ.5,402,37 కోట్లను జమ చేశారు. జూన్ 30 తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు. మొదటి దశలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు.
బుధవారం రెండో విడతలో భాగంగా 2 నుంచి మూడు ఎకరాలు ఉన్న 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.1590 కోట్లు జమ అయింది. 26.50 లక్షల ఎకరాలకు రెండో విడత రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.10 ఇచ్చేవారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు బంధును రైతు భరోసా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. అయితే ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేవలం 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు.

