కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారన్న ట్రంప్
సోషల్ డెమోక్రాట్స్ అనేవి మోసపూరిత పేర్లని విమర్శించాయి
హిస్పానిక్ ప్రజలు కమ్యూనిజం బాధితులని వెల్లడి
పెట్టుబడిదారీ విధానమే దేశానికి రక్షన్న ట్రంప్
అమెరికా ఉనికికి ప్రపంచ యుద్ధాలు లేదా 9/11 ఉగ్రదాడుల కంటే కూడా కమ్యూనిజం వ్యాప్తి వల్లే అత్యంత ప్రమాదకరమైన అంతర్గత ముప్పు పొంచి ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం అనేది ఒక విపత్తు, అది ఇప్పుడు కొత్త పేర్లతో సమాజంలోకి వస్తోందని. ఈ సందేశాన్ని తాను టిక్ టాక్తో పాటు అంతర్జాతీయ వేదికలపై విస్తృతంగా ప్రచారం చేశారు. కమ్యూనిజం భావజాలాన్ని ప్రజలకు ఆకర్షణీయంగా చెప్పడం చాలా సులభమని ట్రంప్ నేనే గనుక కమ్యూనిస్ట్ని అయితే.. చరిత్రలోనే లెనిన్ అంతటి గొప్ప లీడర్ని అయ్యేవాడిని. జీవితాంతం ఉచితంగా ఇళ్లు ఇస్తామని వారు నమ్ముతారు.. కానీ 12 నెలల్లోనే ప్రజలు ఎంతటి దరిద్రంలో మగ్గిపోతారో అని ఎద్దేవా చేశారు. కమ్యూనిజం వైపు వెళ్తే సమాజం ఎప్పటికీ వెనక్కి రాలేదని, చివరికి ఘోరమైన పేదరికంలో మరణించాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాడికల్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు లేదా సోషల్ డెమోక్రాట్లు అంటే పదాలన్నీ వినడానికి బాగున్నా.. అవన్నీ దేశాన్ని నాశనం చేయడం అత్యంత ప్రమాదకరమని ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశంలోని హిస్పానిక్ (లాటిన్ అమెరికా) ప్రజలు గతంలో కమ్యూనిజం బాధలు అనుభవించి వచ్చారు కాబట్టే.. తనకు ఎక్కువగా మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అమెరికాలోని తన రాజకీయ ప్రత్యర్థులు కొందరు ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, వారు దేశానికి చాలా ప్రమాదమని. కేవలం స్వేచ్ఛా విఫణి పెట్టుబడిదారీ విధానం ద్వారానే అమెరికా సంపన్న దేశంగా నిలబడగలదని ట్రంప్ పునరుద్ఘాటించారు.
పోస్ట్ అమెరికాకు కమ్యూనిజం వ్యాప్తి వల్లే తీవ్ర ముప్పు : ట్రంప్ మొదట కనిపించింది విశాలాంధ్ర.

