Tealangana : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి
తెలంగాణ: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. తనకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని, ఆ తర్వాతే పార్టీ అని, ఆ తర్వాత వ్యక్తిగతమని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో లోతైన చర్చకు కారణమయ్యాయి. ఈటల రాజేందర్ మావోయిస్టుల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లో పనిచేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఆయన తనదైన ముద్రను వేసుకున్నారు. బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తో పొసగడంతో పాటు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
బీజేపీలో చేరి…
దీంతో ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. హుజారాబాద్లో ఓటమి పాలైన 2024 ఎన్నికల్లో ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే సామాజికవర్గం కోటాలతో తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. కానీ రాకతో పాటు గతంలో ప్రముఖ పాత్ర పోషించిన హుజూరాబాద్కు ఆయనను దూరం చేయడంతో పాటు పార్టీలో సరైన అవకాశం కల్పించిన కొంత ఈటల రాజా ఇబ్బందులు పడేందుకు గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే తిరిగి బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారాన్ని డు ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. కానీ ఇటీవల ఒక వివాహ వేడుకలో మాజీ మంత్రి కేటీఆర్ ను కలవడం, ఆయన కుటుంబ సభ్యులతో కలసి మాట్లాడడంతో మరొకసారి ఈ ప్రచారం ఊపందుకుంది. కానీ ఈటల రాజేందర్ మాత్రం తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని చెప్పారు.
పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో…
కానీ ఆయనన్నారు నాకు తెలంగాణ ముఖ్యమని ఎందుకని? పార్టీ తర్వాతేనని అన్న మాటకు అర్థం ఏంటన్న దానిపై కూడా బీజేపీ రాష్ట్ర నేతలు ఆరా తీస్తున్నారు. యాధృచ్ఛకంగా అన్న మాటలేనా? లేక ఇందులో ఏదైనా అంతరార్ధం ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరడం లేదని బీజేపీలోనే కొనసాగుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని అంటున్నారు. తనను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడంపైన కూడా ఈటల రాజేందర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడతానని ఈటల అనడం పైనా కూడా సోషల్ మీడియాలో వివిధ కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో ఈటల రాజేందర్ కు సంబంధాలు బాగా లేవని, ఈటల రాజేందర్ ఎందుకు అన్నారన్నది కాలమే అని అంటున్నారు.
వార్తల సారాంశం – బీజేపీ కంటే ముందు తెలంగాణ వస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి

