ఇండియన్ సినిమాలో కంగనా రనౌత్ ఒక దశలో చాలా తక్కువ హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్మంది ఇమేజ్. ఇండియాలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆమెదే. ‘క్వీన్’ మూవీతో ఈ ఘనతను ముందుగా కంగనా. ఆ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన ‘మణికర్ణిక’ కూడా అదే స్థాయిలో విజయవంతం అయింది. ఇలా వరుసగా కంగన ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కాయి. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్కి ఒకప్పుడు మినిమం ఓపెనింగ్స్ ఉండేవి.
కానీ ఎప్పుడైతే కంగనా లేని పోని వివాదాల్లోకి వెళ్లడం.. కొందరు బాలీవుడ్ ప్రముఖులను అదే పనిగా టార్గెట్ చేయడం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి హద్దులు దాటి మాట్లాడడం మొదలుపెట్టిందో.. అప్పట్నుంచి ఆమె పట్ల జనాల్లో వ్యతిరేకత మొదలైంది. అది క్రమంగా తార స్థాయికి చేరుకుని కంగనా సినిమాలకు నెగెటివ్గా మారిపోయింది.
ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించే స్థాయి నుంచి పట్టుమని పది కోట్లు కూడా రాని స్థితికి చేరుకుంది కంగనా.
ధకడ్, ఎమర్జెన్సీ లాంటి సినిమాలు టాక్తో సంబంధం లేకుండా దారుణమైన ఫలితాన్నిచ్చాయి. ఈ రెండు చిత్రాలలో ఏది డబుల్ డిజిట్ కలెక్షన్ల మార్కును అందుకోలేకపోయింది.
‘ఎమర్జెన్సీ’కి పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కంగన కొత్త సినిమా ‘భారత్ భాగ్య విదాత’ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. టాక్ కూడా బాగుంది. కానీ సినిమా చూడడానికి థియేటర్లలో జనమే లేరు.
ఈ చిత్రం రోజు కేవలం కోటి రూపాయల నెట్ తొలి కలెక్షన్లు ఇండియాలో. ఇది డిజాస్ట్రస్ ఓపెనింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంగనా సినిమా బాగుందన్నా జనాలు చూడడానికి రెడీగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు కంగన పేరు చెప్పి సినిమాలను సెల్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆమె పేరే మైనస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై కంగనాతో సినిమాలు తీయాలంటే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.

