హైదరాబాద్ : మదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సైఫాబాద్ పోలీసులు చింతల్బస్తీలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ. సీతయ్య ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
150 మంది విద్యార్థుల భాగస్వామ్యం
నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, సుమారు 150 మంది విద్యార్థులు ర్యాలీలో ఉన్నారు. మాదకద్రవ్యాల అలవాటు వల్ల వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై పడే తీవ్ర శక్తిపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ప్రజలకు చైతన్య సందేశాలు
చింతల్బస్తీ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు, పోలీసు సిబ్బంది డ్రగ్స్కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
“డ్రగ్స్కు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి”
“డ్రగ్స్ లేని యువత.. బలమైన దేశం”
“ఆరోగ్యాన్ని ఎంచుకోండి.. డ్రగ్స్ను కాదు”
“తెలివిగా ఉండండి.. డ్రగ్స్ జోలికి వెళ్లకండి”
“డ్రాగ్స్ను అరికట్టండి.. భవిష్యత్తును రక్షించండి”
ఈ సందర్భంగా ఎస్హెచ్వో ఎ. సీతయ్య మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. మదకద్రవ్యాల సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

