- ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర
- రథయాత్ర భారత సంస్కృతికి ప్రతీక
- దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు, రథయాత్రను శాశ్వత భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రకాశవంతమైన ప్రతీకగా అభివర్ణించారు. మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, దేశంలో ఐక్యత, సంతోషం, శ్రేయస్సు మరింత పెరగాలని ఆకాంక్షించారు.
రథయాత్ర భారత సంస్కృతికి ప్రతీక: మోడీ
రథయాత్ర సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. “రథయాత్ర పవిత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇది భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రకాశవంతమైన ప్రతీక. రథయాత్ర సంప్రదాయాలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తరతరాల ప్రజలను ప్రేరేపిస్తాయి. వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవ వంటి విలువలను ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, సమాజంలో ఐక్యత భావాన్ని మరింత మెరుగుపరచాలని ప్రార్థించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ విదేశాల్లోని జగన్నాథ భక్తులకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. భక్తుడు, భగవంతుని కలయికకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవం ఎంతో విశిష్టమైనదని ఆమె పేర్కొన్నారు. మహాప్రభు జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథయాత్ర ద్వారా భక్తుల వద్దకు రావడం భక్తి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టమని ఆమె అన్నారు. శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
పూరీలో రథయాత్రకు సర్వం సిద్ధం
పూరీ జగన్నాథ ఆలయంలోని సింహద్వారం వద్ద జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి కోసం రూపొందించిన మూడు రథాలు సిద్ధంగా ఉంచారు.
నందిఘోష – శ్రీ జగన్నాథ స్వామివారి రథం
తాళధ్వజ – బలభద్రుడి రథం
దర్పదళన – సుభద్ర అమ్మవారి రథం
ప్రతి ఏడాది నిర్వహించే ఈ రథయాత్రను లక్షలాది మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పూరీకి చేరుకుంటారు.
పూరీలో కట్టుదిట్టమైన భద్రత
భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పూరీ నగరంలో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 13,000 మంది పోలీసు సిబ్బంది, 15 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, NSG కమాండోలు, సముద్ర తీరంలో 500 మంది లైఫ్గార్డులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసు బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.
డ్రోన్లతో నిఘా
జనసందోహాన్ని నియంత్రించేందుకు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. భద్రతను మరింత మెరుగుపరిచేందుకు డ్రోన్లు, ఆంటీన్డ్రాన్ వ్యవస్థలు, భూమి, సముద్రం, గగనతలం నుంచి నిఘా కొనసాగిస్తున్నట్లు ఒడిశా పోలీసు యంత్రాంగం ఉంది.
లక్షలాది మంది భక్తుల రాక
హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగల్లో ఒకటైన పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ବବବବ୍ବ ବବବ୍ବରବବବବବବବବବବବବବବବବରବବବବବବବବବବବବବବବବଁବବବବବବବଁବବବବଭ ఏహా భారతీయ కాలుజటి టీవీ రత్నాత్రా అనైక్ పికుప్రైనా దెయ్యి. ఏహా బినమ్రత, సామ్యుహిక్ అబ్యూషగ్రహన్ ఇంకా నైరూప్య
ମହବବ୍ବଭଁବବବନବା
– నరేంద్ర మోదీ (@narendramodi) జూలై 16, 2026

