విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజల మనసుల్లో సుస్థిర కోసం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తోరాటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొత్తూరి కృష్ణమూర్తి, తోరాటి వసంతరావు, తోరాటి శ్రీను, అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి రామకృష్ణ, తుమ్మ రాజు, మురమళ్ల వీరబద్రాచార్యులు, చిట్టూరి ఏడుకొండలు, సాలెడ్రం ముత్యాల రావు, ఖండవిల్లి రామారావు, బొర్ర రామకృష్ణ, నరకుల శ్రీను తదితరులున్నారు.

