హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ చోరీ జరిగింది. టిఫిన్ కోసం బస్సు ఆపితే ఓ ప్రయాణికుడి నుంచి దొంగలు రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలయాపల్లి సమీపంలో పూజిత హోటల్ వద్ద చోరీ జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు టిఫిన్ కోసం పూజిత హోటల్ దగ్గర ఆగింది. ఈ విధంగా ప్రయాణికుడు ఆరే రవీందర్ రెడ్డి దగ్గరున్న క్యాష్ బ్యాక్ ఎత్తుకెళ్లారు దొంగలు.
బ్యాగులో సుమారు రూ.10 లక్షల సమాచారం. ఈ ఘటనపై బాధితుడు రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నార్కెట్ పల్లి సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ దగ్గర గత కొద్దిరోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపాడు యజమాని. గతంలో కూడా ఇదే హోటల్ వద్ద పలుమార్లు ప్రయాణికుల నుంచి దొంగలు డబ్బులు ఎత్తుకెళ్లడం.

