ఏపీ సమాచార కమిషన్ వ్యాఖ్య
అమరావతి: పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, ప్రభుత్వ అధికారులను వేధించడానికి వినియోగిస్తే సహించబోమని తేల్చి చెప్పింది. ఆర్టీఐని దుర్వినియోగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్టీఐ చట్టాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రధాన సమాచార కమిషనర్ సూచించారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన కేసులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారుడు పదేపదే ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి పలువురిని ఇబ్బందులకు గురిచేసింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడి రెండో అప్పీల్ను కమీషన్ కొట్టివేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన వివిధ ఫిర్యాదుదారుడు పదేపదే ఆర్టీఐ దాఖలు చేసినట్లు విచారణలో వెల్లడైందని కమిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే అతను కోరిన కళాశాల అధికారులు అందించారు, అదే మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయడం ద్వారా ప్రభుత్వ వినియోగంపై అనవసర భారం మోపినట్లు కమీషన్ గుర్తించింది. ఈ సందర్భంగా కళాశాల అధికారులు అవసరమైన వాటిని పూర్తిగా అందించారని, గతంలో కమీషన్ ఇచ్చినట్లు సక్రమంగా అమలు చేసినట్లు నిర్ధారించబడింది. విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడు 800 పేజీలకు పైగా ఉచితంగా పొందిన కమీషన్ సూచించింది.
చట్టం దుర్వినియోగం కారాదు…
ముఖ్యంగా మహిళా కళాశాల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదుదారుడిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైందని గుర్తించారు. సంబంధిత కేసుల్లో కోర్టు శిక్ష కూడా విధించినట్లుగా. ఈ సందర్భంగా ఆధారాలు లేని ఆరోపణలను కమీషన్ తోసిపుచ్చింది. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఫిర్యాదుదారుడిపై బ్లాక్లిస్ట్ చర్యలు తీసుకుంటూ, భవిష్యత్తులో అతడి నుంచి వచ్చే ఆర్టీఐ దరఖాస్తులను స్వీకరించరాదని కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులనూ కమీషన్ ప్రస్తావించింది. కేసుపై పూర్తి విచారణ అనంతరం ఫిర్యాదుదారుడి రెండో అప్పీల్ను కొట్టివేస్తూ విచారణను ముగించినట్లు కమీషన్.
పోస్ట్ అధికారులను వేధించడానికి ‘ఆర్టీఐ’ని వాడొద్దు మొదట కనిపించింది విశాలాంధ్ర.

