AI నీటి వినియోగం: ఏదైనా సరే వాడకం ఎక్కువైతే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా అలానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏ ఐ చుట్టూ తిరుగుతోంది. కంపెనీల ఉద్యోగులను పక్కనపెట్టి ఏఐ ద్వారానే పనిచేయిస్తున్నాయి. కీలక ప్రాజెక్టులను సైతం ఏ ఐ ద్వారా పూర్తి చేస్తున్నారు. దీంతో చాలామంది ఐటీ ఉద్యోగులను కోల్పోతున్నారు. రోడ్డున పడుతున్నారు.
ఏ ఐ వల్ల మనుషులకు సంబంధించి ఇది ఒక విపత్తు అయితే.. భవిష్యత్తు కాలంలో మరో విపత్తు కూడా పెరిగింది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించిన సమాచార కేంద్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి 130 కోట్ల మందికి సరిపడా నీరు వీటికి అవసరమని.. సర్వర్లను చల్లపరిచేందుకు.. విద్యుత్ వాడకానికి సంబంధించిన విపరీతమైన నీరు కావాలి. ప్యూచర్లో హ్యూమన్స్ కంటే ఎక్కువ ఇవే వాటర్ తాగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫోటోలు.. వీడియోలను జనరేట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరమని.. కంపెనీలు.. ప్రభుత్వాలు.. యూసర్లు జాగ్రత్తగా ఉండాలని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.
ఇటీవల కాలంలో డాటా సెంటర్ల ఏర్పాటు పెరిగిపోయింది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా ఎక్కువైంది. ఈ టెక్నాలజీ ద్వారా ఫోటోలు రూపొందించడం.. వీడియోలు రూపొందించడం.. ఇంకా అనేక రకాల పనులు చేయడంతో టెక్నాలజీకి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా డాటా సెంటర్ల మీద ఒత్తిడి పెరిగింది. డాటా సెంటర్ల పనితీరు పెరిగిపోతే.. విద్యుత్ చాలా అవసరం పడుతుంది. డాటా సెంటర్ల ప్రత్యేకంగా చల్లపరచాలి. ఇదంతా జరగాలంటే కచ్చితంగా నీరు కావాలి. ఆ నీటితోనే వాటిని కూల్ చేయవచ్చు.
ఇప్పుడంటే పర్వాలేదు కానీ.. భవిష్యత్తు కాలంలో అప్పుడు వీటి వినియోగం ఇలానే పెరిగిపోతే నీరు మరింత అవసరం. ఇప్పటికే భూగోళంలో చాలా వరకు ప్రాంతాలలో నీటి కొరత తీవ్రంగా ఉంది. భవిష్యత్తు కాలం ఎలా ఉంటుందో చెప్పలేము. పైగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు డాటా సెంటర్లకు కావలసిన నీటిని ఎలా సరఫరా చేస్తారు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. అందువల్లే టెక్నాలజీని పరిమిత స్థాయిలో వాడుకోవాలని.. అనవసరమైన కార్యకలాపాలకు టెక్నాలజీని ఉపయోగించుకుంటే పరిణామాలు వేరే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వరకు నేచురల్ రియర్సెస్ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

