ఇటీవల కాలంలో మన చుట్టూ ఉన్న సముద్రాలలో పట్టు సాధించడానికి చైనా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ దేశంతో దోస్తీ కడుతోంది. బంగ్లాదేశ్తో కూడా మైత్రి కొనసాగుతోంది. చివరికి చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా అందించిన ఏ సౌకర్యాన్ని కూడా వదిలివేయడం లేదు. సహజంగానే చైనా దుర్మార్గమైన దేశం. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేసే దేశం. అలాంటప్పుడు చైనాతో జాగ్రత్తగా ఉండాలి. చైనాతో స్నేహం కొనసాగించే దేశాలతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే సమయంలో వ్యూహాత్మక ధోరణి ప్రదర్శించాలి.
సరిగ్గా ఇదే ఆలోచనతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా దేశంలో పర్యటిస్తున్నారు. కీలకమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే అక్కడితోనే నరేంద్ర మోడీ ఆగిపోవడం లేదు. చైనాకు ఏకకాలంలో చెక్ పెట్టే విధంగా ఇండోనేషియాతో ఆయన ఒప్పందాలకు కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానమైనది మలక్క జల సంధి వద్ద నిర్మాణం సబాంగ్ పోర్ట్.
ఈ పోర్టును భారత్.. ఇండోనేషియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తాయి. మలక్కా జల సంధి ద్వారా 40% గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. చైనా టోటల్ మారీ టైం ట్రేడ్ 60 నుంచి 70% ఇక్కడ నుంచే సాగుతూ ఉంటుంది. ఈ జలసంధికి 100 మైళ్ళ దూరంలో భారత్.. ఇండోనేషియా కలిసి సభాంగ్ పోర్టు నిర్మించాయి. దీంతోపాటు భారత్ ఇండోనేషియాతో కలిసి అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.. ఇటీవల కాలంలో హార్మోజ్ జల సంధి మూతపడితే ప్రపంచం ఏ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి ఆధునిక కాలంలో కూడా చాలావరకు సరుకు రవాణా జలాల మీదుగా సాగుతోంది. అలాంటప్పుడు వ్యూహాత్మకంగా నిర్మించుకుంటే భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను సులువుగా ఎదుర్కోవచ్చు.
సబాంగ్ పోర్టు ద్వారా భారత చైనాకు చెక్ పెడుతుంది. ఎలాగంటే చైనాకు సంబంధించిన ట్రేడ్ లో సింహభాగం ఇక్కడి నుంచే కొనసాగుతుంది. అలాంటప్పుడు భారత్ ఇక్కడ పోర్ట్ నిర్మిస్తే.. చైనా భవిష్యత్తు కాలంలో తోక జాడించే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే.. భారత్ ఇక్కడ అడ్డుకోవచ్చు. ఫలితంగా చైనాకు వాణిజ్యపరంగా ఎదురు దెబ్బ తగులుతుంది. చైనా జుట్టు మన చేతిలో ఉండాలంటే కచ్చితంగా ఇండోనేషియా మనకు అనుకూలంగా ఉండాలి. అన్నిటికంటే ఇక్కడి పోర్టు మీద మన పెత్తనం ఉండాలి. అందుకే నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ముంబై రోడ్లు నీటిలో? ఫర్వాలేదు — స్థానికులు వాటిని 5-నక్షత్రాల స్విమ్మింగ్ పూల్స్గా మార్చారు
బ్లేమ్ గేమ్లో నేతలు బిజీగా ఉన్నారు. భారతదేశం అత్యుత్తమంగా ఉంది!#ముంబయి వరదలు pic.twitter.com/SqJIWtL4df– సోక్రటీస్ (@NewsSportzz) జూలై 7, 2026

