రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కలనే, దమ్ముంటే ఎన్నికలకు పోవాలి
సొంత సర్వేలో బిఆర్ఎస్కి 78 సీట్లు వచ్చింది ముమ్మాటికి నిజం
తాను సర్వే చేయించుకోలేదని దేవునిపై ఒట్టేసి చెప్పాలి
తన పాలనపై నమ్మకం ఉంటే..అసెంబ్లీ రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలి
కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా ప్రజలపై పగబట్టారు
మేడిగడ్డతో సంబంధం లేకుండా అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపవచ్చు
భద్రాచలం మునిగిపోతుందంటూ అబద్ధాలు
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 117 స్థానాలు గెలుస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది, కాంగ్రెస్కు 117 స్థానాలు కాదు కదా, 7 స్థానాలు కూడా రావని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం సీఎం స్వయంగా సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78కిపైగా స్థానాలు వస్తాయని తేలింది. మరో 4 సర్వేల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నివేదికలు వచ్చాయి.
తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ మీడియాతో రేవంత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేది కాలేనని, తన సొంత సర్వేలో 78 సీట్లు వస్తాయని చెప్పింది ముమ్మాటికీ వాస్తవమన్నారు. తాను సర్వే చేయించుకోలేదు అన్న విషయం నిజమైతే, దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలన్నారు. రాముడిపైన ఒట్టు వేసి అబద్ధాలు చెబితే రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుందని కేటీఆర్. తన పాలన పట్ల అంత నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు లేదా అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉప ఎన్నికల ఎన్నికలకు పోవాలని సవాల్ చేశారు.
నీళ్లు ఎత్తిపోయడం తెలవదు..సంచులలో పైసలు నింపడం తెలుసు
రేవంత్ రెడ్డికి నీళ్లు ఎత్తిపోయడం తెలవదు, కేవలం సంచులలో పైసలు నింపి ఢిల్లీకి కట్టే ఈఎంఐలు మాత్రమే తెలుసునని కేటీఆర్ గుర్తు చేశారు. మొలవది అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలాంటి ఆయన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం రేవంత్ రెడ్డి స్థాయి కాదని అన్నారు. రాహుల్ గాంధీ 2014 నుంచి పదుల సంఖ్యలో ఎన్నికలు ఓడిపోయాడని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనని కేటీఆర్ ప్రశ్నించారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీని ఆపగలిగే శక్తి ఉంటే వెంటనే రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలో, లేదంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఉపఎన్నికలో లేదా మొత్తం శాసనసభను రద్దు చేసి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే దమ్ము ఉందా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. నిజంగానే రేవంత్ రెడ్డికి వెంటనే అధికారంలోకి వస్తానన్న ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కూడా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికవ్వడం కలనే అన్నారు. తాను మాట్లాడేది రాజకీయ వ్యతిరేకమని, పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం కేవలం 23 శాతం మాత్రమే నీరు ఉంది, మిగిలిన 77 శాతం ఖాళీగా ఉందని సూచించబడింది.
200 టీసీల నీటితో గోదావరి బేసిన్ను సస్యశ్యామలం చేయవచ్చు
రిటైర్డ్ ఇంజినీర్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి కన్నెపల్లి పాన్స్ హౌస్ నుంచి మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయని సూచించారని కేటీఆర్ తెలిపారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు నీటి లిఫ్ట్ చేస్తే సుమారు 200 టీఎంసీల నీటితో గోదావరి బేసిన్ను సస్యశ్యామలం చేయాలని వారు సూచించారని చెప్పారు. అయితే ఈ సూచనలను అమలు చేయకుండా సీఎం భేషజాలకు పోతున్నారని. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన కరువని కేటీఆర్. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భద్రాచలం మునిగిపోతుందనే కారణంతో నీటిని ఎత్తిపోకుండా ఉండటం అర్థరహితమని.
2022లో గోదావరిలో భారీ వరదలు వచ్చినప్పటికీ మేడిగడ్డకు, భద్రాచలానికి ఎలాంటి నష్టం జరగలేదని గుర్తుచేశారు. రైతుల కక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ ప్రయోజనాల కోసం. బీఆర్ఎస్పై కోపం ఉంటే కేసులు పెట్టాలని, విమర్శించాలని, కానీ రైతులపై ప్రతీకారం తీర్చుకోవద్దని కేటీఆర్ అన్నారు. రైతులను ఎండబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర రేవంత్ రెడ్డి ప్రసిద్ది చెందింది.
హరీశ్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
హరీష్ రావుపై తరచూ వస్తున్న పుకార్లను కేటీఆర్ ఖండించారు. హరీశ్ రావు నికార్సయిన నాయకుడని, కేసీఆర్ తయారు చేసిన సైనికుడని కొనియాడారు. పార్టీ మార్పుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయన ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఖాతాలో ఉన్న నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆ ఆరు హత్యలు ‘ప్రభుత్వ హత్యలే’
షాబాద్లో జరిగిన ఆరు హత్యలు సాధారణ హత్యలు కావని, ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన ‘ప్రభుత్వ హత్యలే’ అని కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యానికి ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన అన్నారు. షాబాద్ ప్రభుత్వ ఘటన వైఫల్యానికి నిదర్శనమన్న ఆయన పోక్సో కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించి ఆరుగురి ప్రాణాలు బలిగొనే పరిస్థితిని కల్పించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచి ప్రజల ప్రాణాలను, మహిళల భద్రతను గాలికొదిలేసిందని. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు విచ్చలవిడిగా బెయిళ్లు లభిస్తుండగా, మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సరిగా వాదించకపోవడం వల్ల నేరస్థులకు ధైర్యంగా ఉన్నట్లుంది.

