ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు పెద్దగా అంచనాలు లేని చిత్రాలు కూడా ఇరగాడేస్తుంటాయి. చిన్న సినిమాలు కూడా ప్రభంజనం సృష్టిస్తుంటాయి. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్కే పట్టం కడుతున్నారు. సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా చూస్తున్నారు. తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇదే అవసరం వక్కాణించింది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ సుకుమారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాను కలిసిన ఆమెకు.. తమిళ సినీ పరిశ్రమలో పరిస్థితుల గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయిపోయాడు, అజిత్ సినిమాలు చేయట్లేదు.. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో ఒక శూన్యత ఉంది కదా అని అడిగితే ఐశ్వర్య పరిణతితో కూడిన జవాబు చెప్పింది.
విజయ్ లేకపోయినా, అజిత్ సినిమా చేయకపోయినా.. సినిమా పరిస్థితి ఏమీ ఇబ్బందికరంగా లేదు.. ఇటీవల ‘కరుప్పు’ సినిమా ఎంత బాగా ఆడిందో తెలుసు కదా అని ఆమె ఉదాహరణ చూపించింది. దీనితో పాటు హలీవుడ్ మూవీ ‘అబ్సెషన్’ గురించి ఐశ్వర్య మాట్లాడింది. ఆ సినిమాలో మనకు తెలిసిన నటినటులు ఎవరున్నారు.. మరి పది కోట్ల ఖర్చుతో తయారైన ఆ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు ఎలా వచ్చాయి అని ఐశ్వర్య ప్రశ్నించింది.
అందులో అమ్మాయి నోనోనో అంటుంటే మన ఆడియన్స్ ఎందుకు అంత ఫీలయ్యారు అని ఆమె చెప్పింది. ప్రేక్షకులకు భాషతో కానీ.. స్టార్లతో కానీ సంబంధం లేదని.. వాళ్లు కనెక్ట్ అయ్యే సినిమా ఇస్తే దాన్ని ఆదరిస్తారని ఐశ్వర్య అభిప్రాయపడింది. కంటెంట్ ఈజ్ కింగ్ అని.. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే ఐశ్వర్య ఉదాహరణగా వక్కాణించింది.
అయితే స్టార్ పుల్ అనేది వేరని, సినిమా ఎలా ఉన్నా సరే అదిరిపోయే ఓపెనింగ్ పడాలంటే అది కేవలం స్టార్ హీరోలే సాధ్యమని అంటున్నారు. ఓపెనింగ్ అంటే విజయ్ పేరు మీద ఉన్న రికార్డులు ఎన్నో చెప్పలేం. మరి విజయ్, అజిత్ లాంటి స్టార్లు ఇండస్ట్రీకి దూరం అయితే అటువంటి ఓపెనింగ్ రికార్డులు పడవని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

