- సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడం సరైనదే.
- ఆయన నిర్బంధంలో లేడు, వైద్యానికి సహకరించాలి.
- ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపిన హైకోర్టు..
సోనమ్ వాంగ్చుక్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, ఏకపక్షం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నిరాహారదీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వానికి తరలించే హక్కు ఉందని స్పష్టం చేసింది. వాంగ్చుక్ అక్రమంగా నిర్బంధించారనే ఆయన భార్య ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.
వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సఫ్దర్జంగ్ ఆసుపత్రిపై మీకు నమ్మకం లేదని, ఆయనను మేదాంతా ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించాలని ఆమె పేర్కొంది. ఆరోగ్యం క్షీణించడం వల్లే ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ప్రభుత్వం కోర్టులో విచారణ చేపట్టింది. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రభుత్వ నిర్ణయమని యాదృచ్ఛిక చర్యగా చెప్పలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
వాంగ్చుక్ తరుఫున వాదిస్తున్న కపిల్ సిబల్, ఆయనను నిర్బంధం లేకుండా ఆసుపత్రిలో ఉంచడం సరైనదా అని ప్రశ్నించారు. ఇందుకు కోర్టు ఆయన నిర్బంధంలో లేరని, ఆయన స్వేచ్ఛాయుత పౌరుడేనని స్పష్టం చేసింది. ఆయన స్వచ్ఛందంగా ఆసుపత్రికి వెళ్లలేదని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తరలించడం సమంజసమే అని చెప్పింది. వాంగ్చుక్ శారీరక స్వేచ్చ ఉల్లంఘన జరుగుతుందనే వాదనల్ని కోర్టు తిరస్కరించింది. ఆయన సమ్మతితోనే వైద్యులు చికిత్స అందించినట్లు తెలిపారు. ఇదే సమయంలో వాంగ్ చుక్ అవసరమైన వైద్య చికిత్స విషయంలో వైద్యులతో సహకరించాలని సూచించింది.

