Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- Donald Trump : ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లవి మొసలి కన్నీరు.. అందరినీ ఒక్కదెబ్బతో లేపాస్తం.. | ఖమేనీ అంత్యక్రియల్లో ఏడుస్తున్న ఇరానియన్లపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్లు జైలు శిక్ష
- ప్రజాలతోనే నేరుగా… చంద్రబాబు కొత్త ప్రయోగం!
- మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్
- మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోంది: మమత
- హర్మూజ్లో కొత్త సేవా రుసుములు: ఇరాన్
- పాజిటివ్ రెస్పాన్స్ తో గుర్తుకొస్తున్నాయి
- ట్రాఫిక్ నరకం.. గుడిహత్నూర్ లో నత్తనడకన అండర్ పాస్ పనులు
Author: swathi.gnec@gmail.com
బిగ్ బాస్ అగ్నిపరిక్ష 2: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ గత ఏడాది ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకు కారణం ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడం , వాళ్ళు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం , ఆ కారణం చేత ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవడం , మరో సామాన్యుడు టాప్ 3 గా నిలవడం , ఇలాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అవ్వడం తో , రెండవ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదలై 5 నెలలు పూర్తి కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు…
రైల్వే ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ప్రస్తుతం డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతాలు ఎప్పటి నుంచి అందుతాయి? చేతికి ఎంతెంత డబ్బులు వస్తాయి? అసలు ఈ పెంపు వల్ల ఎవరెవరికి లాభం చేకూరనుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పడు చదవండి.. పెరిగిన అలవెన్సులు.. జేబులు ఫుల్: కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులకు, రిటైర్ అయిన పెన్షనర్లకు డీఏ, డీఆర్లను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఇక పెరిగిపోతున్న ఖర్చుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మందికి పెద్ద ఊరటనిచ్చింది. బేసిక్ శాలరీలో ఇక 60 శాతం డీఏ: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈ పెంపుదల జరిగింది. ఇప్పటివరకు రైల్వే ఉద్యోగులకు బేసిక్…
పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?
బాలికపై రోగుల వేధింపుల కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయనను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను తఱలించి విచారిస్తామన్నాడు. కాగా.. గత వారం కిందటే భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. అయితే.. ఆయన తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. వెతికేందుకు ఐదు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనూహ్యంగా శనివారం రాత్రి 9 గంటల సమయంలో భగీరథ్ నార్సింగ్లో ఉన్నట్టు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అన్ని దారులు.. ఈ కేసులో భగీరథ్ రక్షణ పొందేందుకు ఉన్న అన్ని దారులు మూసుకుపోవడంతోనే ఆయన పోలీసులకు లొంగిపోయినట్టు చూపుతున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ దక్కలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందాలని ప్రయత్నించారు. కానీ, సెలవులు కావడంతో వేకేషన్ బెంచ్ అవకాశం లభించలేదు. ఇంకో వైపు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పోలీసులు…
నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తన రాబోయే చిత్రం వృషకర్మ అనే యాక్షన్-పౌరాణిక థ్రిల్లర్లో పని చేస్తున్నాడు. అతని ఇటీవలి ప్రాజెక్ట్ తాండల్ తరువాత, నటుడు తన దృష్టిని ఈ కొత్త చిత్రంపై మళ్లించాడు, ఇందులో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో మరియు స్పర్ష్ శ్రీవాస్తవ విరోధిగా కూడా నటించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. నిర్మాణ బృందం ఇటీవల రాజస్థాన్లో ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసింది, రాష్ట్రంలోని చారిత్రక ప్యాలెస్లు మరియు వాస్తుశిల్పం నేపథ్యంలో కీలక సన్నివేశాలను సంగ్రహించింది. ప్రధాన చిత్రీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించింది. ఈ చిత్రం దాని ప్రధాన పౌరాణిక అంశాలు మరియు ప్రపంచ నిర్మాణానికి మద్దతుగా గణనీయమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్-సృష్టించిన చిత్రాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మేకర్స్ గతంలో విడుదల చేసిన సంగ్రహావలోకనం ప్రేక్షకుల నుండి…
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్ర బాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే ఔనౌనే సమాధానమే వస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావించారు. వీటి వల్ల రాష్ట్రంలో మెరుగైన జీవనం కనిపిస్తోందని ముఖ్యంగా పేదల కుటుంబాలలో ఇది ప్రధానమైన మార్పును తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం పథకంలో ప్రతి కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా ఏటా రూ.15000 చొప్పున ఇస్తున్నారు. అయితే.. దీనిని మరింత పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి మఱిన్ని పథకాలను తీసుకువచ్చే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ప్రస్తుతం ఇస్తున్న పథకాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. సంపద సృష్టితోనే ఇవన్నీ సాకారం అవుతాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళామహిళలకు ఇచ్చిన హామీలను అమ లు చేశామని చంద్రబాబు చెప్పారు.…
లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు సీఎం, సహనటుడు విజయ్ ని కలిశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ ఆయన కొన్ని డిమాండ్లను నూతన ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వాటిలో ఓటికి 8 వారాల విండోని తప్పనిసరి చేయడం. అధిక శాతం తమిళనాడులో షూటింగ్ జరుపుకున్న సినిమాలకు 10 శాతం రాయితీతో పాటు 4 శాతం ఎంటర్ టైన్మెంట్ టాక్స్ తీసేయమని. ఇదంతా బాగానే ఉంది కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. సినిమా అనేది నిర్మాత సొత్తు. దాని మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పన్నులు, షోల పరిమితులు, సెన్సార్ లాంటివి తన కంట్రోల్లో ఉంటాయి ఎంతకు అమ్మాలి, ఎంత నిడివిలో ఓటికి ఇవ్వాలంటే ప్రొడ్యూసర్ ఇష్టం. గవర్న వచ్చి నువ్వు రెండు నెలల తర్వాత డిజిటల్ లో అందుబాటులో రూల్ పెడితే చట్టప్రకారం. దానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకుని అన్ని పార్టీల మద్దతు పొందాలి. ఎవరైనా…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం రాత్రి.. భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులు అప్పగించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఫిర్యాదు రాగానే పీఎస్లో అప్పగిద్దామనుకున్నా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. లాయర్లను సంప్రదించి తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు ముందుంచాడు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది”మరోవైపు, బండి భగీరథ్ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి తెలిపారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నామని.. అక్కడి నుంచి పేట్బషీరాబాద్ పిఎస్కు తరలించినట్లు చెప్పారు.
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహిస్తోంది. , డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై నిరసన తెలుపుతోంది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళనలను నిర్వహించనుంది. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపినట్లయిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.పెట్రోలు, డీజిల్ ధరలపై…ఇటీవల గ్యాస్ ధరలను పెంచారని, ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని, ఎన్నికలు వెంటనే ధరలను పెంచి ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. దీంతో ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మొయినాబాద్ ఫాంహౌస్ హత్యలు : వారిద్దరూ మహిళలు. ఇటీవల ఇంట్లో నుంచి (వేరువేరుగా) బయటికి వెళ్లిన వారిద్దరూ మళ్లీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. బంధువులకు ఫోన్ చేసి కనుకున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. చివరికి వారు వినకూడని వార్త విన్నారు. జరగకూడని దారుణాన్ని చూశారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరులో ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. వారిద్దరూ వృద్ధులే. చివరికి వారు విగత జీవులుగా మారారు. బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒకరు.. యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట ప్రాంతంలో వారిద్దరి విగత దేహాలు కనిపించాయి. అయితే వారిద్దరిని తాండూర్ నుంచి మొయినాబాద్ తీసుకొచ్చి.. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో దారుణానికి పాల్పడ్డారని.. తర్వాత వారి విగతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబేద, తాండూరు…
